Telugudesam: అమిత్ షా లేఖ లోని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి : ఎంపీ కేశినేని

  • ఏపీకి ప్రత్యేకహోదా సహా 18 హామీలు పెండింగ్ లో ఉన్నాయి
  • రూ.2,500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా పూర్తవుతుంది?
  • రాష్ట్రాభివృద్ధికి బీజేపీ నేతలు తమతో కలిసిరావాలి : కేశినేని నాని

సీఎం చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖలోని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా సహా 18 హామీలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుపతిలో మోదీ నాడు ప్రకటించారని, కేవలం రూ.2,500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని కొనియాడారు. గుజరాత్ కు నాడు సీఎంగా ఉన్న మోదీ కాగ్ రిపోర్ట్ ను వ్యతిరేకించారని, ఇప్పుడేమో, కాగ్ నివేదిక ఆధారంగా కేసులు పెడతామని బీజేపీ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ నేతలు తమతో కలిసి రావాలని ఈ సందర్భంగా కేశినేని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News