ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం.. అవిశ్వాసానికి రెడీ!
- అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్ఎస్, అన్నాడీఎంకేలను బీజేపీ పురికొల్పుతోందంటున్న ప్రతిపక్షాలు
- పూర్తి బలం ఉన్నప్పుడు చర్చకు వెనకడుగు ఎందుకంటున్న సొంత పార్టీ ఎంపీలు
- అవిశ్వాసంపై చర్చించాలని నిర్ణయానికి వచ్చిన బీజేపీ
చర్చకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించడంతో మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అసోంలోని గువాహటిలో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ పార్లమెంటులో అవిశ్వాసం తీసుకురావాల్సిందిగా సవాలు విసరడం అందులో భాగమేనని చెబుతున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకేలకు నిర్దిష్ట హామీ కూడా ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.