ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఎంపీ మురళీమోహన్
- నటీనటులను టార్గెట్ చేసిన రాజేంద్రప్రసాద్
- అందరికీ బాధ కలిగిందన్న మురళీమోహన్
- తాను మాట్లాడతానని ఊరడించిన చంద్రబాబు
ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సినీ పరిశ్రమలోని ఎందరో ఇప్పటికే డిమాండ్ చేశారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, తాను స్వయంగా రాజేంద్రప్రసాద్ తో మాట్లాడతానని, ఇకపై ఈ తరహా విమర్శలు వద్దని చెబుతానని వెల్లడించారు. కాగా, ఏపీ ప్రజల డబ్బులు తింటున్న సినీ పరిశ్రమ, హోదా కోసం ఒక్క నిరసన కూడా చేయలేదని, ప్రభుత్వానికి అండగా నిలవలేదని బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.