kothapalli geetha: ఈ రోజు ప్ర‌ధాని మోదీని క‌లిశా.. ఏపీ ప్ర‌జ‌ల‌కు పూర్తి సాయం చేస్తాన‌న్నారు: ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత

  • ఈ సంవ‌త్స‌రం కూడా నా నియోజక వర్గానికి నిధులు ఇవ్వాల‌ని ప్ర‌ధానిని కోరా
  • ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను మోదీకి వివ‌రించా
  • విశాఖప‌ట్నం రైల్వే జోన్, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీని వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కోరాను

ఈ రోజు తాను ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీని క‌లిశాన‌ని అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత అన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... త‌న‌ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరు చేసినందుకు మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపానని, అలాగే ఈ సంవ‌త్స‌రం కూడా నిధులు ఇవ్వాల‌ని కోరాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను మోదీకి వివ‌రించాన‌ని, విశాఖప‌ట్నం రైల్వే జోన్, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీని వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కోరానని తెలిపారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు పూర్తి సాయం చేస్తాన‌ని, ఇచ్చిన హామీల‌ ప్రకారం అన్ని అంశాల‌ను నెర‌వేర్చేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మోదీ త‌న‌తో అన్నారని కొత్త‌ప‌ల్లి గీత తెలిపారు.    

  • Loading...

More Telugu News