vishnu: 'ఆచారి అమెరికా యాత్ర'కు ముహూర్తం కుదిరింది

  • విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ 
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం

విష్ణు హీరోగా జి.నాగేశ్వర రెడ్డి 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, కొంతకాలం నుంచి సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం.

 బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, కథ ప్రకారం చాలా భాగం షూటింగును అమెరికాలో జరుపుకుంది. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గతంలో విష్ణు .. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'దేనికైనా రెడీ' ... ' ఈడోరకం ఆడోరకం' సినిమాలు సక్సెస్ ను సాధించాయి. అందువలన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.  

  • Loading...

More Telugu News