girl: పాలమూరులో విషాదం.. ఇంట్లోంచి పరుగెడుతూ వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక

  • ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ
  • తీవ్ర మనస్తాపానికి గురైన మానస (15)
  • మృతదేహాన్ని 2 గంటలపాటు శ్రమించి బయటకు తీసిన సిబ్బంది

తన అక్కాచెల్లెళ్ల గొడవపడ్డ ఓ 15 ఏళ్ల బాలిక.. అందరూ చూస్తుండగానే ఇంట్లోంచి పరుగెత్తుకెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పాలమూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఆ బావిలో దూకిన కాసేపటికే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అది మంచి నీటి ట్యాంక్ కావడంతో ఆ బావికి సరఫరా అవుతున్న నీటిని బంద్ చేసిన అధికారులు.. అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయంతో బావిలో ఉన్న నీటిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అలా దాదాపు రెండు గంటలపాటు శ్రమించి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు.

ఆ బావి లోతు 65 అడుగులు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ బాలిక జగ్జీవన్‌రాం కాలనీకి చెందిన రాములు, వెంకటమ్మల నాలుగో కూతురు మానస (15) అని పోలీసులు చెప్పారు. ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైన మానస ఈ ఘటనకు పాల్పడిందని తేల్చారు. కాగా, ఆ బావి బస్టాండ్‌కు సమీపంలోనే ఉంటుందని, దానికి ఇనుప కంచె ఏర్పాటు చేయాలని తాము చాలా సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు.

  • Loading...

More Telugu News