Jagan: 'కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం'పై ట్వీట్‌ చేసిన జగన్

  • అవిశ్వాస తీర్మాన నోటీసును ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వైసీపీ అధినేత
  • రేపు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం-జగన్
  • ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తాం

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ రేపు అవిశ్వాస తీర్మానం పెడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానం కోసం తమ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి ఇచ్చిన నోటీసును ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా, వైసీపీ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కూడా మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, వైసీపీ నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News