Chandrababu: వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం: టీడీపీ కీలక నిర్ణయం

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు
  • మంత్రులతో జరిగిన చర్చలో చంద్రబాబు నిర్ణయం
  • రేపే అవిశ్వాస తీర్మానం పెట్టనున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పెట్టనున్న తీర్మానానికి తమ ఎంపీలు మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తామని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News