rana: హారర్ థ్రిల్లర్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ .. ఆయనతోనే రానా మూవీ!

  • 'గృహం'తో మెప్పించిన మిళింద్ రాయ్ 
  • ఆయన వినిపించిన లైన్ కి రానా ఓకే  
  • జోనర్ విషయంలో సస్పెన్స్  

'బాహుబలి' తెచ్చిపెట్టిన భారీ క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ, తన స్థాయికి తగిన కథలనే ఎంచుకుంటూ రానా ముందుకెళ్తున్నాడు. మరిన్ని విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. అలాంటి రానా తాజాగా మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. మిళింద్ రాయ్.

ఇంతకుముందు సిద్ధార్థ్ హీరోగా ఆయన 'గృహం' అనే హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకుడి ప్రతిభకు అభినందనలు తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఆయన వినిపించిన ఒక లైన్ కొత్తగా అనిపించడంతో, వెంటనే రానా ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఈ సినిమా జోనర్ ఏమిటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  

  • Loading...

More Telugu News