charan: ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. అందుకే 'రంగస్థలం' చేశాను: సుకుమార్

  • పల్లెలో పుట్టి పెరిగాను 
  • ఫారిన్ లో ఎక్కువ సినిమాలు చేశాను 
  • పల్లె పట్ల ప్రేమతో ఈ సినిమా తీశాను

సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' ఈ నెల 18వ తేదీన వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సుకుమార్ మాట్లాడాడు. " నేను ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. సినిమాల్లోకి వచ్చేవరకూ పల్లెటూరే నా ఇల్లు. అలాంటి నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా విదేశాల్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను" అన్నాడు.

 'నాన్నకు ప్రేమతో' సినిమాను దాదాపు విదేశాల్లోనే తీశాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, 'సార్ .. మీరు చాలా బాగా సినిమాలు తీస్తున్నారుగానీ, మన తెలుగు నేటివిటీ నేపథ్యంలో ఎందుకు సినిమాలు చేయడం లేదు? అని అడిగారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది .. ఫలితంగానే గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ కథ సిద్ధమైంది. పల్లె పట్ల నాకు గల మమకారాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది" అని ఆయన అన్నాడు.     

  • Loading...

More Telugu News