secunderabad: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఎగిసిపడుతోన్న మంటలు

  • భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతోన్న రోగులు, వారి బంధువులు
  • మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే‌ందుకు యత్నిస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
  • ప్ర‌మాదానికి షాట్ స‌ర్క్యూటే కార‌ణ‌ం?

సికింద్రాబాద్ లోని యశోద ఆసుప‌త్రిలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆసుప‌త్రిలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో రోగులు, వారి బంధువులు భ‌యాందోళ‌న‌ల‌కు గురయ్యారు. మంట‌లు పెద్ద ఎత్తున ఎగిసి ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే‌ందుకు ప్ర‌యత్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి షాట్ స‌ర్క్యూటే కార‌ణ‌మా? అన్న విష‌యం గురించి స‌మాచారం అందాల్సి ఉంది.       

  • Loading...

More Telugu News