anna hajare: ఈ నెల‌ 23న ఢిల్లీలో నిరసన తెలుపుతాం.. అనుమతి ఇవ్వండి: మోదీకి అన్నాహజారే లేఖ

  • రైతుల స‌మ‌స్య‌ల‌పై జన్‌లోక్‌పాల్ నిర‌స‌న తెలుపుతుంది
  • నిర‌స‌న తెలిపేందుకు ఓ ప్రదేశాన్ని కూడా సూచించండి
  • చాలాసార్లు కేంద్ర హోంమంత్రికి లేఖ‌లు రాశాం
  • ప్ర‌తిస్పందన రాలేదు.. అందుకే ప్రధానికి లేఖ‌ రాస్తున్నాం

ఈ నెల‌ 23న ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు అనుమ‌తి ఇచ్చి, ఓ ప్రదేశాన్ని సూచించాల‌ని కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి సామాజిక నేత అన్నాహజారే ఓ లేఖ రాశారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై త‌మ‌ జన్‌లోక్‌పాల్ నిర‌స‌న చేప‌డుతుంద‌ని తెలిపారు. తాము కొన్ని నెల‌ల క్రితం ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రితో పాటు ప‌లు శాఖ‌ల‌కు  లేఖలు రాశామ‌ని, త‌మ‌కు ప్ర‌తిస్పందన రాలేద‌ని, దీంతో ఇప్పుడు ప్రధానికి లేఖ రాసినట్లు అన్నా హ‌జారే పేర్కొన్నారు. అలాగే తాను లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లుల‌ను అమలు చేయాలని కూడా మోదీకి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 43 లేఖలు రాశానని, వీటికి కూడా ప్ర‌తి స్పంద‌న‌ రాలేదని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News