prabhas: ఎన్టీఆర్ .. మహేశ్ తోనేకాదు, ప్రభాస్ తోనూ జోడీ కడుతోన్న పూజా హెగ్డే

  • ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే
  • మహేశ్ జోడీగాను ఛాన్స్ 
  • ప్రభాస్ నాయికగాను దక్కిన చోటు

చూస్తుంటే 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో పూజా హెగ్డే దశతిరిగిపోయినట్టే కనిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె చేసిన 'సాక్ష్యం'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆమె త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా కోసం ఎంపికైంది. అలాగే మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మొదలుకానున్న సినిమా కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన కూడా ఆమె ఎంపికైందనేది తాజా సమాచారం. 'సాహో' తరువాత ప్రభాస్ .. కృష్ణంరాజు సొంత బ్యానర్లో ఒక మూవీ చేయనున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకోసం పూజా హెగ్డే ను సంప్రదించడం ..ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సుందరి ప్రభాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనుందన్న మాట.      

  • Loading...

More Telugu News