Sujana Chowdary: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై నేను కామెంట్ చేయను: సుజనా చౌదరి

  • కేసీఆర్ వ్యూహం ఏంటో?
  • ఆయన గొప్ప రాజకీయవేత్త  
  • దేశ రాజకీయాల్లో మార్పు రావాలనే విషయాన్ని చంద్రబాబు ఎప్పుడో చెప్పారు : సుజనా చౌదరి

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై తానేమీ కామెంట్ చేయనని ఏపీ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు పలు రకాల కారణాలు ఉండొచ్చు, కేసీఆర్ వ్యూహం ఏంటో? ఆయన గొప్ప రాజకీయవేత్త అని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలనే విషయాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఈ మాట చెప్పారని అన్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలు జరగాలని, డిజిటల్ మేనేజ్ మెంట్ కావాలనే విషయాలను భారతదేశంలోనే మొట్టమొదట ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని, కనుక, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహాదా గురించి మాట్లాడుతూ, ఏపీకి రావాల్సిన వాటన్నింటిని సాధించి తీరుతామని అన్నారు. ఏపీపై ప్రధాని మోదీకి ఎటువంటి కోపమూ లేదని, ఇదేమి కుటుంబ వ్యవహారం కాదు కదా కోపతాపాలు చూపించేందుకని సుజనా అన్నారు. 

  • Loading...

More Telugu News