kavitha: ఏపీ బీజేపీకి సినీ గ్లామర్.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి!

  • బీజేపీలో చేరిన కవిత
  • టీడీపీలో అవమానాలకు గురయ్యానన్న నటి
  • తనను గెంటివేశారంటూ ఆవేదన

ప్రముఖ సినీ నటి కవిత భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో ఈ ఉదయం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని... ఆయన స్ఫూర్తితోనే బీజేపీలో చేరానని తెలిపారు. టీడీపీ నుంచి తాను బయటకు రాలేదని... ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డానని మండిపడ్డారు. ఆ పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని చెప్పారు. తిట్టినవారికి పదవులు ఇస్తున్న చంద్రబాబు... పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News