chennai: చెన్నైలో కలకలం.. కాలేజీ ముందు బీకాం విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

  • కేకేనగర్‌లోని మీనాక్షి కాలేజీలో బీకాం చదువుతోన్న అశ్విని
  • కాలేజీ నుంచి ఇంటికి వెళుతుండగా ఘటన
  • నిందితుడిని పట్టుకుని చితక్కొట్టిన స్థానికులు
  • దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు

చెన్నైలోని కేకేనగర్‌లో అశ్విని అనే అమ్మాయిని అళగేశన్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపి కలకలం సృష్టించాడు. హత్య చేసి పారిపోతోన్న అళగేశన్‌ను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. సదరు అమ్మాయి మీనాక్షి కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతోందని.. ఈ రోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో గేట్ వద్ద నిల్చొని ఉందని, అదే సమయంలో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడని తెలిపారు.

దీంతో అశ్విని రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు. స్థానికులు చితక్కొట్టడంతో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయని ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ అమ్మాయిని యువకుడు ఎందుకు హత్య చేశాడన్న విషయం తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News