Ramcharan: ‘రంగస్థలం’లో మరో పాట విడుదల

  • ‘ఓయ్ రంగమ్మ మంగమ్మా..’ పాట విడుదల చేసిన చిత్రయూనిట్
  • చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవీశ్రీ సంగీతం
  • ఈ నెల 30న విడుదల కానున్న ‘రంగస్థలం’

‘రంగస్థలం’ చిత్రంలో ఇప్పటికే రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేసింది. తాజాగా, మరో పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. ‘ఓయ్ రంగమ్మ మంగమ్మా.. ఓయ్ రంగమ్మ మంగమ్మా ఏం పిల్లడు..పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..’ అంటూ ఈ పాట కొనసాగింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవీ శ్రీ సంగీతం సమకూర్చగా, ఎంఎం మానస ఆలపించారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Ramcharan
rangasthalam
  • Error fetching data: Network response was not ok

More Telugu News