YSRCP: అందుకే, టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధపడ్డారు: వైసీపీ నేత మేకపాటి

  • రాజకీయ అవసరాల కోసమే టీడీపీ నేతల రాజీనామాలు
  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వరని చంద్రబాబుకు ఇప్పుడు తెలిసిందా?
  • వైసీపీకి 25 మంది ఎంపీల నివ్వండి, అన్నీ సాధిస్తాం 

ఏపీ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధ పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవసరాల నిమిత్తమే టీడీపీ నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వరనే విషయం చంద్రబాబుకు ఇప్పుడు తెలిసిందా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్నీ సాధిస్తామని మేకపాటి అన్నారు. కాగా, వైసీపీకి చెందిన మరో నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ బడ్జెట్ లో లెక్కలన్నీ అవాస్తవాలేనని, నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని అన్నారు. ఏపీ ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబే, రాష్ట్ర జీడీపీ అద్భుతంగా ఉందని పేర్కొనడాన్ని అనుమానించాల్సి వస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News