Pawan Kalyan: కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటే తప్పేంటి?: పవన్ కల్యాణ్

  • ఏపీ, తెలంగాణల్లో ఎన్ని చోట్ల పోటీ చేస్తామో ప్రకటిస్తాం
  • 14న జరిగే సభలో పార్టీ కార్యాచరణను వెల్లడిస్తా
  • సీఎం నేనే అని చెప్పుకుంటే సరిపోదంటూ.. జగన్ కు చురక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను సన్నిహితంగా ఉంటే తప్పేముందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందా? అని అన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే సభలో ఏపీ, తెలంగాణల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ... '2019లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే, ప్రజలు చేసేస్తారా?' అని ప్రశ్నించారు. సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నప్పటికీ... సమయం లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News