Special Category Status: ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కనిమొళి

  • ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’
  • మ‌ద్ద‌తు ప‌లికిన కనిమొళి
  • ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌కు త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే ఎంపీ కనిమొళి మ‌ద్ద‌తు ప‌లికి, దీక్ష‌లో కాసేపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల‌ పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ రోజు ఈ దీక్ష‌లో కాంగ్రెస్‌ లోకసభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే  కూడా పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను అమలు చేయాల్సిందేన‌ని అన్నారు. అధికారంలోకి వస్తే త‌మ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుంద‌ని తెలిపారు.   

  • Loading...

More Telugu News