KCR: కేసీఆర్ కోసం మరో అధ్యాధునిక బస్సు సిద్ధమవుతోంది!

  • అత్యాధునిక బస్సును కొనుగోలు చేసేందుకు హోంశాఖ నిర్ణయం
  • బస్సు విలువ రూ. 7 కోట్లకు పైనే
  • బస్సు ఎలా ఉండాలనేదానిపై ప్రణాళికలు రూపొందిస్తున్న కమిటీ

ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరింత భద్రతను పెంచాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం తన పర్యటనల కోసం ఆయన వినియోగిస్తున్న బస్సుకు తోడుగా మరో అత్యాధునిక బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన వినియోగిస్తున్న బస్సు విలువ రూ. 4 కోట్లు. ఛండీగఢ్ కు చెందిన జేసీపీఎల్ సంస్థ దీన్ని తయారు చేసింది. గత మూడేళ్ల నుంచి కేసీఆర్ ఈ బస్సునే వాడుతున్నారు.

ఇప్పుడు మరింత మెరుగైన బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనబోతున్నారు. రూ. 7 కోట్లకు పైగా విలువైన ఈ బస్సును మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల పర్యటనకు గాను వినియోగిస్తారు. ఈ బస్సులో భద్రతాపరమైన మరిన్ని ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బస్సు ఎలా ఉండాలనే విషయంపై ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. కొన్ని నెలల్లోనే ఈ బస్సులో కేసీఆర్ పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News