accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 26 మంది మృత్యువాత

  • పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్
  • అదుపుతప్పి మురికి కాల్వలోకి బోల్తా
  • 12 మందికి తీవ్ర గాయాలు

గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్ అదుపుతప్పి మురికి కాల్వలోకి బోల్తా కొట్టింది. దీంతో ట్రక్ లో ప్రయాణిస్తున్న వారిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. తొలుత మృతుల సంఖ్య 20 కాగా, ఆ తర్వాత 26కు పెరిగింది.

ఓ పెళ్లికి సంబంధించిన బృందాన్ని ట్రక్ తీసుకెళుతోంది. రాజ్ కోట్-భావ్ నగర్ హైవేపై వెళుతుండగా రంఘోలా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 12 మంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News