Viral Videos: అబ్బుర పరుస్తోన్న తల్లీకొడుకుల యాడ్‌... ఇంటర్నెట్‌లో వైరల్‌

  • 'కేక్ అప్' అనే తిను బండారం కోసం పాక్‌లో యాడ్‌ 
  • తల్లీకొడుకుల అనుబంధం తెలుపుతోన్న యాడ్‌
  • పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుందని చెబుతోన్న ప్రకటన

ఇటీవ‌ల పాకిస్థాన్‌లో 'కేక్ అప్' అనే తిను బండారం పబ్లిసిటీ కోసం రూపొందించిన ఓ యాడ్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఈ యాడ్‌ను ఏకంగా కోటి మందికి పైగా చూశారు. ఇందులో ఓ మహిళ ఇంటి పనులను బాధ్యతగా చూసుకుంటూ అలాగే వైద్యురాలిగా పనిచేస్తుంది. తన కుమారుడి కోసం అన్నింటినీ అందుబాటులో ఉంచి ఆసుపత్రికి వెళుతుంది. అయితే, ఆమె కుమారుడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు.

కానీ, వినకుండా ఆమె జాబ్‌కి వెళ్లిపోతుంది. దీంతో ఆ చిన్నారి నిరాశగా స్కూల్‌కి వెళ్లిపోతాడు. ఆ పిల్లాడి ఇంటి నుంచి లంచ్ బాక్స్ వస్తుంది. దాన్ని ఆ పిల్లాడు ఓపెన్ చేసి చూస్తే అందులో తనకు ఇష్టమైన కేక్ ఉంటుంది. ఆ కేక్ కావాలని ఉదయం తన అమ్మకి చెప్పాలని అనుకున్నానని గుర్తు చేసుకుంటాడు. ఆ కేక్‌తో పాటు అందులో ఓ పేపర్ కూడా ఉంటుంది. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నీ మాటలు వినే సమయం నాకుంటుందని అందులో రాసుంటుంది.

నీకేం కావాలో తెలుసుకుంటూనే ఉంటానని తన అమ్మ రాసిన ఆ లేఖను చూసి ఆ పిల్లాడు మురిసిపోతాడు. ఆ పిల్లాడు కూడా తన తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. ఓ రోజు ఆమె లంచ్ బాక్స్ తెరవగానే అందులో సగం కేక్ ముక్క ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. 'నువ్వే చెప్పావుగా, పంచుకుంటే ఆనందం రెట్టింపవుతందని' అని ఓ పేపర్‌లో ఆ పిల్లాడు రాసి ఉంచుతాడు. అబ్బుర పరుస్తోన్న ఈ యాడ్ మీరూ చూడండి... 

  • Loading...

More Telugu News