ESha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తేజ దర్శకత్వంలో ఈషా రెబ్బా 
  • మహేశ్ చిత్రానికి బాలీవుడ్ టెక్నీషియన్ 
  • 'సాహో'లో గ్యాంగ్ స్టర్ గా బాలీవుడ్ నటి

*  ఇటీవల వచ్చిన 'అ!' సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయిక ఈషా రెబ్బా త్వరలో తేజ దర్శకత్వంలో నటించనుంది. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ముఖ్య పాత్ర పోషించే నారా రోహిత్ సరసన ఈషాను ఎంచుకున్నట్టు సమాచారం.  
*  ప్రస్తుతం 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ పనిచేయనున్నాడు.
*  ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో బాలీవుడ్ నటి మందిరా బేడి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో తాను గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్నట్టు తాజాగా మందిర మీడియాకు తెలిపింది. చిత్రంలో ఇది కీలకమైన పాత్ర అని చెప్పింది.
    

  • Loading...

More Telugu News