KCR: థర్డ్ ఫ్రంట్ వస్తుంది... నేనే ముందుంటా, చంద్రబాబుతోనూ మాట్లాడతా!: సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

- కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
- రెండు పార్టీలూ రాజకీయ వ్యవస్థను దెబ్బతీశాయి
- ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాల్సిందే
- ఇప్పటికే సీతారాం ఏచూరితో మాట్లాడానన్న కేసీఆర్
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ వచ్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఈ రెండు పార్టీలూ దేశ రాజకీయ వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అందుకు తానే నడుం బిగిస్తానని, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.
దేశాన్ని మార్చేందుకు కావాల్సిన మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించాల్సి వస్తే తాను సిద్ధమని స్పష్టం చేశారు.
