బందరులో తెలుగు తమ్ముళ్ల లొల్లి.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన వైనం!
- గోపీచంద్ కు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి దక్కకపోవడంపై ఆగ్రహం
- మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డ నాయకులు
- గోపీచంద్ పార్టీ వీడతారంటూ ప్రచారం
దీంతో, గోపీచంద్ వర్గీయులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రాజీనామాలకు సిద్ధపడ్డారు. బందరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కుంచె నాని, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గణితిశెట్టి గోపాల్ లతో పాటు పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు. గోపీచంద్ సైతం పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఎక్కడివరకు వెళతాయో వేచి చూడాలి.