rajamouli: 'రంగస్థలం' సెట్ కి మళ్లీ రాజమౌళి .. కారణం అదేనా?

  • 'రంగస్థలం' కోసం విలేజ్ సెట్ 
  • ఆ సెట్ కి రెండవసారి వచ్చిన రాజమౌళి 
  • తన సినిమాకి ఉపయోగపడుతుందేమోననే ఆలోచన  

'రంగస్థలం' సినిమా గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. అందువలన ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ ఖర్చుతో ఒక విలేజ్ సెట్ వేసి షూట్ చేశారు. ఈ సెట్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా, కొంతకాలంక్రితం చిరంజీవితో కలిసి ఒకసారి రాజమౌళి అక్కడికి వెళ్లారు. సెట్ ను తీర్చిదిద్దిన తీరును ఆయన అభినందించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ విలేజ్ సెట్ కు తన అసిస్టెంట్స్ తో కలసి వెళ్లడం ప్రత్యేకతను సంతరించుకుంది.

సుకుమార్ దగ్గరే వుండి మొత్తం సెట్ ను రాజమౌళికి చూపించాడు. సెట్ విషయంలో సుకుమార్ తీసుకున్న శ్రద్ధకు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. అయితే మళ్లీ ఈ సెట్ కి రాజమౌళి ఎందుకు వచ్చారు? అనే సందేహమే అందరిలోను తలెత్తుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందట. అందుకు ఈ సెట్ ఏవైనా ఉపయోగపడుతుందా అనే విషయాన్ని పరిశీలించడం కోసమే మళ్లీ ఆయన అక్కడికి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి.   

  • Loading...

More Telugu News