Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్ కథ 
  • 'సాక్ష్యం' శాటిలైట్ హక్కులు 5.5 కోట్లు?
  • వరుణ్ తేజ్ సినిమాలో నో సాంగ్స్! 
  • సిక్స్ ప్యాక్ లో వస్తున్న యంగ్ హీరో

*  ప్రస్తుతం తాను చేస్తున్న సావిత్రి బయోపిక్ 'మహానటి'పై కథానాయిక కీర్తి సురేశ్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. ఇందులో కాస్ట్యూమ్స్ విపరీతంగా మార్చవలసి వచ్చిందని చెప్పింది. 'మామూలుగా ఒక సినిమాకు మహా అయితే సుమారు 30 రకాల కాస్ట్యూమ్స్ వాడతాం. కానీ సావిత్రి పాత్ర పరిధి విస్తృతం కావడంతో 120 రకాల కాస్ట్యూమ్స్ వాడవలసి వచ్చింది' అని చెప్పింది కీర్తి.
*  బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం' చిత్రానికి బిజినెస్ పరంగా భారీ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో హిందీ డబ్బింగ్ హక్కులు 8 కోట్లకు ఇప్పటికే అమ్ముడుపోగా, తాజాగా చిత్రం తెలుగు శాటిలైట్ హక్కులను 5.5 కోట్లకు జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
*  'తొలిప్రేమ' హిట్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో ఒక్క పాట కూడా వుండదట. చిత్ర కథనానికి ఆటంకంగా ఉంటాయన్న ఉద్దేశంతో పాటలను పెట్టడం లేదని తెలుస్తోంది.
*  'నేను శైలజ', 'మిస్టర్' చిత్రాలలో ఇటీవల ప్రత్యేక పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో ప్రిన్స్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన తన ఫొటోగ్రాఫ్ ను ప్రిన్స్ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. త్వరలో చేయనున్న చిత్రంలో ఇలా సిక్స్ ప్యాక్ లో కనపడతాడు.  

  • Loading...

More Telugu News