Chandrababu: బీజేపీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు... వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చన్న సీఎం

  • బీజేపీ, కాంగ్రెస్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
  • లేకపోతే దేశానికి మంచిది కాదు
  • ప్రత్యేక హోదా రాయితీలు ఏపీకి ఇవ్వాల్సిందే

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రనికైనా అన్యాయం జరిగితే... దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే బాధ్యత వహించాలని చెప్పారు. ఈ రెండు పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే... దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రత్యేక హోదా రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు, ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చంటూ భవిష్యత్ రాజకీయాలపై పరోక్ష సంకేతాలను పంపించారు.

  • Loading...

More Telugu News