Sridevi: ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ బాత్ టబ్‌లో ఎలా పడుతుంది?: తస్లీమా నస్రీన్

  • శ్రీదేవి మృతిపై అనుమానాలు
  • శ్రీదేవి మృతదేహం పూర్తి నీటితో నిండి ఉన్న బాత్‌టబ్‌లో దొరికింది
  • ఇది ఆత్మహత్య కాదని భావించవచ్చు

సినీన‌టి శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. మ‌ద్యం తీసుకున్న శ్రీదేవి ప్ర‌మాద‌వశాత్తు బాత్‌టబ్‌లో ప‌డి చ‌నిపోయిన‌ట్లు నిన్న దుబాయ్ ఆరోగ్య శాఖ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్.. చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ బాత్ టబ్‌లో ఎలా పడుతుంది? అని ఆమె ప్రశ్నించారు.

మ‌రో ట్వీట్ చేస్తూ.. శ్రీదేవి మృతదేహం పూర్తి నీటితో నిండి ఉన్న బాత్‌టబ్‌లో దొరికిందని, దీంతో ఇది ఆత్మహత్య కాదని భావించవచ్చని తెలిపారు. అది హత్యా? అనే అనుమానం వ్యక్తం చేశారు. కాగా, గుండెపోటుతోనే శ్రీదేవి మృతి చెందిందని ఆమె కుటుంబం మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్యులు మాత్రం శ్రీదేవి ప్రమాద‌వ‌శాత్తు నీటిలో మునిగి మృతి చెందార‌ని ప్ర‌క‌టించారు. దీంతో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Sridevi
taslima nasreen
dubai
  • Error fetching data: Network response was not ok

More Telugu News