punjab: బ్యాంకు మోసం కేసు ఘటనలో పంజాబ్ సీఎం అల్లుడిపై సీబీఐ కేసు నమోదు

  • అమరీందర్ సింగ్ అల్లుడిపై సీబీఐ కేసు
  • ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ను మోసం చేసిన 13 మంది
  • 13 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ

ఓరియంటల్ బ్యాంకును మోసం చేసిన ఘటనలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అల్లుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ను మోసం చేశారంటూ ఆ బ్యాంకు ఉన్నతాధికారులు పలువురిపై 2017లో సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఫిబ్రవరి 22న కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమరీందర్ అల్లుడితో పాటు సింభోలి షుగర్స్ సంస్థకు చెందిన 13 మందిని సీబీఐ చేర్చింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News