Dhoni: 'మిస్టర్ కూల్‌'కి కోపమొచ్చిన వేళ...!

  • సహచర ఆటగాడు పాండేపై మిస్టర్ కూల్ ఆగ్రహం
  • ఇటు చూడాలంటూ గట్టిగా కేకలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

టీమిండియాలో ఎంఎస్ ధోనీకి 'మిస్టర్ కూల్' అనే పేరుంది. టీమ్ క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు సైతం ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఒంటి చేత్తో విజయాలను అందించిన చరిత్ర అతనిది. ఆ రకంగా 'ముగించే మొనగాడు'గా కూడా అతనికి పేరుంది. అయితే అలాంటి మిస్టర్ కూల్‌కి హఠాత్తుగా కోపం వచ్చేసింది.

అదెప్పుడంటే, దక్షిణాఫ్రికా టీమ్‌తో బుధవారం సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో మనీశ్ పాండేపై ధోనీ గట్టిగా అరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనికి కోపం రావడానికి కారణం...సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రైనా-మనీశ్ పాండే ద్వయం ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది భారీ స్కోరుకు ప్రయత్నించారు.

ఈలోగా రైనా ఔటయ్యాడు. దాంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. తన సహచర ఆటగాడు పాండే అప్రమత్తంగా లేకపోవడంతో అతన్ని గట్టిగా మందలించాడు. మ్యాచ్ 19.1 ఓవర్ వద్ద ఇది చోటు చేసుకుంది. 19వ ఓవర్ రెండో బంతికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న పాండే..ఎటో దిక్కులు చూస్తూ కనిపించాడు. అది గమనించిన ధోనీ...వెంటనే పాండే వైపు చూసి, ఇటు చూడాలంటూ మందలించాడు. ఎప్పుడూ కోపం రాని ధోనీ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వీడియోపై నెట్టింట్లో కామెంట్ల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News