అతి తక్కువ మంది మిత్రుల్లో 'గుండు' ఒకడంటూ బోరున విలపించిన బ్రహ్మానందం!
- ఈ తెల్లవారుజామున మరణించిన గుండు హనుమంతరావు
- ఆయన కుటుంబాన్ని పరామర్శించిన బ్రహ్మానందం
- మూడు దశాబ్దాల అనుబంధాన్ని తలచుకుని కన్నీరు
ఇండస్ట్రీలో తనకున్న అతి కొద్దిమంది మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని, మూడు వారాల క్రితం తన ఇంటికి వచ్చిన హనుమంతు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉందని చెప్పారు. తన ప్రదర్శనలతో లక్షలాది మందిలో నవ్వులు పూయించిన ధన్యజీవి ఆయనని, తనకు ఎదురైన కష్టాలను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడని చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలిపిన బ్రహ్మానందం గుండు మృతదేహం వద్ద చాలా సేపు నిశ్చేష్టుడై నిలబడిపోయారు.