Pawan Kalyan: బీజేపీ-టీడీపీతో జనసేన పార్టీకి మిత్రత్వం ఉందో లేదో పవన్ కల్యాణ్ చెప్పాలి!: బొత్స సత్యనారాయణ

  • కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలం
  • ప్రత్యేక హోదా  కోసం చేసే పోరాటానికి టీడీపీ కలిసి వస్తే మంచిది
  • బీజేపీ-టీడీపీతో జనసేన పార్టీకి మిత్రత్వం ఉందో లేదో పవన్ చెప్పాలి? : వైసీపీ నేత బొత్స

ఏపీకి ప్రత్యేక హోదాపై తమ పార్టీకి స్పష్టత ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని, బీజేపీ-టీడీపీలు కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ పార్టీలు కలసి వస్తే తాము మద్దతుగా వుంటామన్నప్పుడు హేళన చేసిన టీడీపీ, ఇప్పుడు ‘హోదా’ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటానికి టీడీపీ కలిసి వస్తే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ-టీడీపీతో జనసేన పార్టీకి మిత్రత్వం ఉందో లేదో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు రావని మంత్రి నారాయణ చెబుతున్నారని, ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News