Twitter: ట్విట్టర్ లో వైఎస్ జగన్ తాజా ట్వీట్ ఇది!

  • హోదా కోసం ఉద్యమిద్దాం
  • ఇది విభేదాలకు సమయం కాదు
  • ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు
  • ఎంపీలంతా రాజీనామా చేయాలి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన ట్విట్టర్ ఖాతాద్వారా ఓ ట్వీట్ ను ఉంచుతూ, ఇది విభేదాలకు సమయం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దిశగా, ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని కోరుతూ ఓ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని, ఈ డిమాండ్ సాధనకు రాష్ట్రంలోని ఎంపీలందరూ రాజీనామాలు చేయాలని గత రాత్రి ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ట్యాగ్ చేస్తూ, వైఎస్ఆర్ సీపీ ఎంపీలు తొలుత రాజీనామాలు చేస్తారని, వారిని మీ ఎంపీలు కూడా అనుసరిస్తారా? లేదంటే ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ వందల కొద్దీ షేర్లను, వేలకొద్దీ లైక్స్ నూ తెచ్చుకుని వైరల్ అవుతోంది. కాగా, జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర నేటితో నెల్లూరు జిల్లాలో ముగిసి, ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానుంది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైకాపా వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News