Pawan Kalyan: ఏపీ వామపక్ష నేతలకు ఫోన్ చేసిన ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు పవన్ ఫోన్
  • ఈ నెల 16న నిర్వహించే సమావేశానికి రావాలని ఆహ్వానం
  • అంగీకరించిన వామపక్ష నేతలు

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఈ నెల 16న హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరగబోయే సమావేశానికి రావాల్సిందిగా వారికి పవన్ ఆహ్వానం పలికారు. అందుకు, వారు అంగీకరించినట్టు సమాచారం.

కాగా, ఈ సమావేశానికి ఏపీసీసీ నుంచి గౌతమ్, గిడుగు రుద్రరాజు, ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, ఏపీకి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై ఈ సమావేశం జరగనుంది.  

  • Loading...

More Telugu News