yogi adiyanath: యోగి ప్రచారం కోసం బీజేపీ రాష్ట్రాల తహతహ... స్టార్ క్యాంపెయిర్ గా మారుతున్న యూపీ సీఎం

  • యోగి ప్రచారంతో ఓట్లను కొల్లగొట్టే వ్యూహం
  • త్వరలో జరిగే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారం
  • ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లోనూ యోగి ప్రచారానికి ప్రణాళిక

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఓ ఆశాకిరణంగా, ప్రచార తురుపుముక్కగా మారిపోయారు. తమ రాష్ట్రంలో యోగితో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ సీఎంలు కోరుకుంటున్నారు. దీంతో యోగి ఇప్పుడొక స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో నాథ్ పంత్ ఆలయ ప్రధాన పూజారి కూడా యోగినే. శైవులు ఎక్కువగా ఉన్న చోట్ల యోగితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితం ఉంటుందన్న భావన ఉంది.

యోగి ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లోనూ ప్రచారం నిర్వహించిన విషయం విదితమే. కేరళలో ఎర్ర సైన్యానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంలోనూ యోగి పాత్ర ఉంది. త్వరలోనే జరగనున్న ఉత్తరాది రాష్ట్రాలు, ఆ తర్వాత జరిగే కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లోనూ యోగి కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికలు జరిగే ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు రోజుల పాటు యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక్కడ నాథ్ సంప్రదాయాన్ని అనుసరించే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. యోగి ప్రచారంతో ఇక్కడ మంచి ఫలితం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News