India: ప్రాక్టీసు చేస్తూ.. చెమటోడ్చుతోన్న టీమిండియా, దక్షిణాఫ్రికా

  • పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదో వ‌న్డే
  • 3-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్
  • రేపటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం

పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక‌గా రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆరు వ‌న్డేల సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచి ఒక దాంట్లో ఓడిన విష‌యం తెలిసిందే. మ‌రో మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ ను భార‌త్ కైవ‌సం చేసుకుంటుంది. నాలుగో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా చేతిలో అనూహ‌్యంగా ఓడిన టీమిండియా రేప‌టి వ‌న్డేలో మాత్రం కచ్చితంగా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో మైదానంలో ఈ రోజు ప్రాక్టీస్ చేసింది.

మ‌రోవైపు వ‌న్డేల్లో సొంత గ‌డ్డపై ఘోరంగా ఓడిపోతోన్న ద‌క్షిణాఫ్రికా రేప‌టి వ‌న్డేలో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని క‌సిగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ రోజు ఉద‌యం ప్రాక్టీస్ మ్యాచ్ కు వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఆల‌స్యంగా ప్రాక్టీస్ చేశారు. రేపటి మ్యాచ్ కు వాతావ‌ర‌ణం స‌హ‌క‌రిస్తుంద‌నే భావిస్తున్నారు.   

  • Loading...

More Telugu News