Pawan Kalyan: జనసేన కార్యాలయానికి చేరుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్!

  • హైదరాబాద్ లో  జనసేన అధినేత పవన్ ని కలిసిన ఉండవల్లి
  • ఏపీలో జేఏసీ ఏర్పాటుపై చర్చ
  • సుమారు గంటన్నర పాటు జరగనున్న సమావేశం

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ కొంచెం సేపటి క్రితం చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లికి పవన్ సాదర స్వాగతం పలికారు. తమ పార్టీ ప్రముఖులను ఉండవల్లికి ఆయన పరిచయం చేశారు. అనంతరం, వారి మధ్య చర్చ ప్రారంభమైంది. విభజన హామీల సాధనకు ఏపీలో జేఏసీ ఏర్పాటు చేస్తానని పవన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై వారి మధ్య చర్చ జరగనుంది. ఈ చర్చ సుమారు గంటన్నర పాటు జరగనున్నట్టు సమాచారం. కాగా, రాజమండ్రి వెళ్లి ఉండవల్లి అరుణ్ కుమార్ ని పవన్ కలుద్దామనుకున్నారు. కానీ, సెక్యూరిటీ కారణాల రీత్యా పవన్ నే ఉండవల్లి హైదరాబాద్ వచ్చి కలిశారు. రాష్ట్ర విభజన హామీల సాధనకు జేఏసీ ఏర్పాటు చేస్తానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీని  తెరపైకి తేనున్నారు. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణను పవన్ ఇప్పటికే కలిశారు. 

  • Loading...

More Telugu News