Bollywood: 'భారత్‌' చిత్రంలో సల్మాన్ ఖాన్ 'పంచావతారం'!

  • ఐదు పాత్రల్లో ఫ్యాన్స్‌కు కండలవీరుడి పండగ
  • సుల్తాన్ దర్శకుడు అబ్బాస్ జాఫర్‌తో మరోసారి జోడీ
  • అరవై ఏళ్ల భారత చరిత్రపై సినిమా రూపకల్పన
  • ఇండో-పాక్ సరిహద్దు కోసం అబూదాబీలో ఎడారి సీన్

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాలో కనీసం ఐదు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారమ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. 'భారత్' టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. గతంలో సల్మాన్-జాఫర్ కాంబినేషన్‌లో వచ్చిన 'సుల్తాన్', 'టైగర్ జిందా హై' చిత్రాలు హిట్ కొట్టాయి. ఇప్పుడు 'భారత్‌' సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు వారిద్దరూ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ప్రస్తుతం ఈ సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందులో సామాన్యుడి పాత్రలోనూ ఈ కండలవీరుడు కనిపించనున్నాడని తెలిసింది.

కథ డిమాండ్ మేరకు పంజాబ్, ముంబై, ఢిల్లీ, స్పెయిన్, అబూదాబీలోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరపనున్నట్లు సమాచారమ్. ఈ చిత్రంలో గత 60 ఏళ్ల చరిత్రను చూపించనున్నారట. అందువల్ల చారిత్రక సంఘటనల కోసం ప్రత్యేక సెట్‌లను కూడా వేయనున్నారని తెలిసింది. దక్షిణకొరియా డ్రామా 'ఓడ్ టు మై ఫాధర్'కి ఈ సినిమా అధికారిక రీమేక్.

 ఇందులో ఇండో-పాక్ సరిహద్దు కోసం అబూదాబీలో ఒక ఎడారిని ఏర్పాటు చేయనున్నారట. ఇరవై ఏళ్ల వ్యక్తి పాత్రను కూడా సల్మాన్ పోషించనున్నాడట. దానికి తగ్గట్టుగా కనిపించడం కోసం ఈ సూపర్ స్టార్ ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడు. మొత్తానికి ఐదు పాత్రలతో ఫ్యాన్స్‌కు సల్మాన్ విందు భోజనం వడ్డించనున్నాడన్నమాట.

  • Loading...

More Telugu News