KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ కి యాంకర్ ప్రదీప్ వినతి!

  • రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు
  • ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన యాంకర్
  • ఆ పాఠశాల విద్యార్థులు టాయిలెట్, మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతోన్న వైనం

రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల దుస్థితిని గురించి వివ‌రిస్తూ యాంకర్ ప్ర‌దీప్ ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ఓ ట్వీట్ చేశాడు. ఆ పాఠ‌శాల‌లో 120 మంది బాలికలు, 100 మంది బాలురు చదువుకుంటున్నారని, కానీ, ఒక్క బాత్రూమ్ కూడా లేదని వీ కేర్ ఎన్జీవో చేసిన ట్వీట్ ను ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు.

అలాగే, ఆ పాఠశాలకు మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపాడు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు.  తమ టీమ్ ఆ విద్యార్థుల సమస్యలను పరిశీలించిందని, వారి గురించి పట్టించుకోవాలని ప్రదీప్ కోరాడు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కి కూడా ప్రదీప్ ఈ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News