ntr: ప్రభాస్ .. ఎన్టీఆర్ .. మహేశ్ ల మధ్య పోటీ తప్పనట్టే వుంది!

  • షూటింగు దశలో 'సాహో' 
  • వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ 
  • త్రివిక్రమ్ తో కలిసి రెడీ అవుతోన్న ఎన్టీఆర్  

ప్రస్తుతం ప్రభాస్ .. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ విదేశాల్లోనే జరుగుతోంది. అందువలన ఈ ఏడాది చివరికిగాని ఈ సినిమా పనులు పూర్తి కావు. అందుకే, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు తదుపరి సినిమా ఉండనుంది. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన, మరింత కేర్ తీసుకోనున్నారు. అందువలన ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఇదే సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా కూడా మొదలుకానుంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. సహజంగానే త్రివిక్రమ్ తన సినిమాలను పూర్తి చేయడానికి గాను చాలా సమయం తీసుకుంటాడు. అందువలన ఈ సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ పోటీ ఉండనున్నట్టు తెలుస్తోంది.        

  • Loading...

More Telugu News