rana: 'క్షణం' దర్శకుడితో రానా నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ పూర్తి

  • 'క్షణం' తో హిట్ కొట్టిన రవికాంత్ పేరెపు
  • రెండవ సినిమా షూటింగ్ పూర్తి 
  • నిర్మాతగా రంగంలోకి రానా  

ఒక వైపున నటుడిగా విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతోన్న రానా, మరో వైపున తమ బ్యానర్లో స్వయంగా సినిమాలను నిర్మించడం పైనా దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో, కథానాయకుడిగా 'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్ధూ కనిపించనున్నాడు.

ఇక కథానాయికలుగా శీరత్ కపూర్ .. శ్రద్ధా శ్రీనాథ్ .. షాలిని నటించారు. రీ సేంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దర్శకుడు రవికాంత్ పేరెపు పేరు వినగానే 'క్షణం' సినిమా గుర్తుకువస్తుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఘన విజయాన్ని సాధించింది. అందువలన రవికాంత్ పేరెపు తాజా చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఆయన ఎంతవరకూ అందుకుంటాడో చూడాలి మరి.   

  • Loading...

More Telugu News