Narendra Modi: మోదీ మాట్లాడుతుండగా బిగ్గరగా నవ్విన రేణుకా చౌదరి... దీటుగా సెటైర్ వేసిన ప్రధాని!

  • రేణుక నవ్వుకు మోదీ కౌంటర్
  • అప్పట్లో ఈ నవ్వులు రామాయణంలో విన్నాం.. ఇప్పుడు మళ్లీ వింటున్నాం అన్న ప్రధాని
  • బల్లలు చరిచిన బీజేపీ ఎంపీలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు. కాంగ్రెస్ లేని భారత్ అనేది తన నినాదం కాదని... మహాత్మాగాంధీదేనని చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో, ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవద్దని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సూచించారు. ఆ తర్వాత మోదీ ప్రసంగం వింటూ రేణుకా చౌదరి బిగ్గరగా నవ్వారు. ఈ నవ్వుపై మోదీ స్పందిస్తూ, అప్పట్లో రామాయణంలో ఇలాంటి నవ్వులు విన్నామని, ఇప్పుడు మరోసారి వింటున్నామని ఎద్దేవా చేశారు. దీంతో, బీజేపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ నవ్వారు. 

  • Loading...

More Telugu News