India: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

  • కేప్‌టౌన్‌లో మూడో వన్డే
  • ఇప్పటికే 2-0 తేడాతో టీమిండియా ముందంజ
  • ఈ వన్డేలోనూ దూకుడు కొనసాగించాలని ఉత్సాహం

కేప్‌టౌన్‌లో మరికాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ల మధ్య మూడో వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్ లు జరిగిన విషయం తెలిసిందే. మొదటి రెండు వన్డేల్లో ఓడిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలోనయినా గెలిచి పరువు కాపాడుకోవాలని కసిగా ఉంది. మరో వైపు టీమిండియా ఈ వన్డేలోనూ రాణించి తమ దూకుడును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. టెస్టు సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా వన్డేల్లో మాత్రం భారత్‌తో రాణించలేకపోతోంది.

  • Loading...

More Telugu News