Pawan Kalyan: కాసేపట్లో మీడియా ముందుకు పవన్ కల్యాణ్ .. కీలక ప్రకటన చేసే అవకాశం?

  • సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం
  • హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలో పలు వివరాలు తెలపనున్న పవన్
  • ఏం మాట్లాడుతారా? అన్న విషయంపై ఆసక్తి

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలోనే పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడతారని వివరించింది. పవన్ ఏ విషయంపై మీడియాకు వివరిస్తారన్న విషయాన్ని మాత్రం తెలపలేదు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ ప్రజలు, రాజకీయ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించలేదని వారు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపైనే మాట్లాడుతారా? లేక ప్రత్యేక హోదాపై తాను చేయాలనుకుంటోన్న పోరుపై మాట్లాడుతారా? అని విషయంపై ఆసక్తి నెలకొంది. లేదంటే పవన్ కల్యాణ్ తాను ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించే విషయం, పార్టీ బలోపేతంపై కూడా మాట్లాడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News