jashodaben: మోదీ భార్య జశోదాబెన్ కు యాక్సిడెంట్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

  • రోడ్డు ప్రమాదానికి గురైన జశోదాబెన్
  • ప్రమాదంలో మోదీ భార్యకు గాయాలు
  • వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం

ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్ లోని కోటాలో జరిగిన ఓ వేడుకకు కుటుంబసభ్యులతో కలసి హాజరై, గుజరాత్ కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చిత్తోర్ ఘర్ లోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది.

ప్రస్తుతం ఆమె తన సోదరుడు అశోక్ మోదీతో కలసి గుజరాత్ లోని మెహ్సానా జిల్లా ఉంఝా పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆమెకు మెహ్సానా జిల్లా పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News