kalyan ram: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కల్యాణ్ రామ్ .. కొత్త దర్శకుడికి ఛాన్స్

  • 'ఎమ్మెల్యే' మూవీని పూర్తిచేస్తోన్న కల్యాణ్ రామ్ 
  • సెట్స్ పైనే 'నా నువ్వే' సినిమా 
  • త్వరలో కొత్త ప్రాజెక్టు మొదలు

కల్యాణ్ రామ్ ఒక వైపున విభిన్నమైన సినిమాలను నిర్మిస్తూ .. మరో వైపున విలక్షణమైన పాత్రలను పోషిస్తూ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ నటిస్తోంది.

 ఇక జయేంద్ర దర్శకత్వంలో 'నా నువ్వే' చేస్తుండగా .. ఆయన జోడీగా తమన్నా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే కల్యాణ్ రామ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నూతన దర్శకుడు విజయ్ వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే కల్యాణ్ రామ్ ఓకే చెప్పేశాడట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొనసాగే ఈ సినిమాని, 'ఎమ్మెల్యే' మూవీ నిర్మాతలే నిర్మిస్తారట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    

  • Loading...

More Telugu News