Gali Muddukrishnama nayudu: నేడు చంద్రబాబు కార్యక్రమాలన్నీ రద్దు!

  • గాలి ముద్దుకృష్ణమనాయుడికి నివాళులు అర్పించనున్న చంద్రబాబు
  • విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లనున్న సీఎం
  • ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి మృతదేహం

తన దీర్ఘకాల సహచరుడు గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం కారణంగా నేడు సీఎం చంద్రబాబు పాల్లొనాల్సిన అన్ని సమావేశాలు, కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం కొద్దిసేపటి క్రితం తెలిపింది. విజయవాడ నుంచి సీఎం తిరుపతికి వెళ్లి, గాలి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారని, ఆ తరువాత ఆయన తిరుపతి నుంచి హైదరాబాద్ వెళతారని అధికారులు తెలిపారు.

కాగా, గాలి ముద్దు కృష్ణమనాయుడు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో తరలించే ఏర్పాటు చేయాలని సీఎం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News