India: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా క్రికెటర్ డీకాక్

  • ఎడమ చేతి మణికట్టు గాయంతో బాధపడుతోన్న వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ 
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
  • ఎల్లుండి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే

డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో ఓడ‌డంతో పాటు తాజాగా సెంచూరియ‌న్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలోనూ టీమిండియా చేతిలో ద‌క్షిణాఫ్రికా చిత్తుగా ప‌రాజ‌యం పాలైన‌ విష‌యం తెలిసిందే. పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు గాయాల‌పాలు అవుతుండ‌డం ద‌క్షిణాఫ్రికా అభిమానుల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది. డ‌ర్బన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో డుప్లెసిస్ చేతి వేలికి గాయం కావ‌డంతో ఆయ‌న భారత్ తో సిరీస్‌కి దూరం కాగా తాజాగా, గాయం కారణంగా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ కూడా భారత్‌తో జరగనున్న మిగతా వన్డే, టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో డీకాక్ ఎడమ చేతి మణికట్టుకు తీవ్ర గాయమైందని, ఆయన దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ప్రకటించింది. కాగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News